తాజా వార్తలు

Narendra Modi : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.!

narendra-modi

Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆదివారం (మే 10) తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ వీవీఐపీ (VVIP) పర్యటనను పురస్కరించుకుని నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో వాహనాల మళ్లింపులు , తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అధికారికంగా వెల్లడించారు.

మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆంక్షలు (Narendra Modi) అమలయ్యే మార్గాలు

ప్రధాని మోడీ పర్యటించే మార్గాల్లో సాధారణ ప్రజల ప్రయాణాలపై పోలీసులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి గ్రీన్‌ల్యాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, NFCL జంక్షన్, SNT జంక్షన్ , సాగర్ సొసైటీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా NTR భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, (Narendra Modi) పెద్దమ్మ తల్లి ఖమాన్, రోడ్ నెం. 36/31, నీరూస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంటుంది. శిల్పారామం, హైటెక్స్ ఖమాన్, NAC మెయిన్ గేట్, కాసాని గేట్ , HICC పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే సమయాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

narendra-modi-1

సికింద్రాబాద్ పరిసరాల్లో అదనపు (Narendra Modi) అప్రమత్తత

బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్నందున సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినంగా ఉండనున్నాయి. సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున M.G. రోడ్, R.P. రోడ్ , S.D. రోడ్ల వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున సాధారణ ప్రజలు సాధ్యమైనంత వరకు ఈ రహదారుల్లో ప్రయాణించకపోవడమే ఉత్తమమని ట్రాఫిక్ విభాగం సూచించింది.

Read Also : TVK Vijay : రాజకీయ ఉత్కంఠ.. సీఎంగా ‘విజయ్’ పట్టాభిషేకం.. రేపే ప్రమాణస్వీకారం!

ప్రయాణీకులకు పోలీసుల కీలక విజ్ఞప్తి

ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన ప్రయాణీకులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ఇళ్ల నుంచి నిర్ణీత సమయం కంటే చాలా ముందుగానే బయలుదేరాలని పోలీసులు కోరారు. రోడ్డు మార్గాల్లో రద్దీ , మళ్లింపులు ఉండే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని వారు సూచించారు. వాహనదారులు , ప్రయాణీకులు తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవచ్చని లేదా సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్ , ఫేస్‌బుక్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రధాని పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు నగర పౌరులందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.