Kavitha New Party : శనివారం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది.
“తెలంగాణ రాష్ట్ర సేన (TRS)”.. (Kavitha New Party) గులాబీ శ్రేణుల్లో ప్రకంపనలు.!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును “తెలంగాణ రాష్ట్ర సేన (TRS)”గా ప్రకటించారు. ఉదయం 10 గంటల శుభముహూర్తాన పార్టీ పేరును వెల్లడించడంతో పాటు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. (Kavitha New Party) అయితే, పార్టీకి ‘టీఆర్ఎస్’ అనే పేరును ఖరారు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ పేరునే (స్వల్ప మార్పుతో) కవిత ఎంచుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.

గన్పార్కు టు మునీరాబాద్.. (Kavitha New Party)
పార్టీ ప్రకటనకు ముందు కవిత తన దినచర్యను ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి, ఆ దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయల్దేరారు. మార్గమధ్యంలో గన్పార్కుకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా మునీరాబాద్లోని సభా ప్రాంగణానికి చేరుకుని రాజకీయ రణశంఖం పూరించారు.
Read Also : Lucky Zodiac Signs : మే 14 నుండి ‘గజలక్ష్మీ రాజయోగం’.. ఈ రాశుల వారి ఇంట కనక వర్షమే.!
తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా సభా ప్రాంగణం
పార్టీ ఆవిష్కరణ సభ కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. సభా ప్రాంగణానికి ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం వరంగల్ కాకతీయ కళాతోరణం ఆకృతిలో ఉండి అందరినీ ఆకట్టుకుంది. వేదికపై తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు, మహనీయులు బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ప్రతిష్టించి తన పార్టీ సిద్ధాంతాలను పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ ఆత్మగౌరవమే అజెండాగా తన ప్రయాణం సాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
Read Also : TGSRTC : ఆర్టీసీ సమ్మె సుఖాంతం.. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన బస్సులు.!
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. రాజకీయ పరిణామాలు ఎటు?
కవిత తీసుకున్న ఈ నిర్ణయం భారత్ రాష్ట్ర సమితి (BRS)కి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టడం ద్వారా పాత టీఆర్ఎస్ సెంటిమెంట్ను కవిత తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న తన కేడర్ను ఇప్పుడు రాజకీయంగా వాడుకోవడానికి కవిత సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి ఎంతమంది నేతలు ఆమె వైపు వెళ్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం.














