Allu Arjun Palace: హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్లో సినీ తారల సందడి ఎప్పుడూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కలల సౌధాన్ని ఇక్కడే అత్యంత విలాసవంతంగా నిర్మిస్తుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ కొత్త ఇల్లు రూపుదిద్దుకుంటుండటం విశేషం. అటు ఇల్లు, ఇటు వరుస పాన్ ఇండియా సినిమాలతో బన్నీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
Also Read : Hyderabad Trains : హైదరాబాద్ ట్రావెలర్స్కు బంపర్ ఆఫర్.. 8 కొత్త స్పెషల్ రైళ్లు..!
మెగాస్టార్ ఇంటి (Allu Arjun Palace) పక్కనే ఐకాన్ స్టార్ ‘ప్యాలెస్’
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అంటేనే విలాసానికి మారుపేరు. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ సుమారు 4,000 గజాల సువిశాల విస్తీర్ణంలో ఒక భారీ లగ్జరీ హౌస్ను నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణ విలువ దాదాపు ₹80 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే ఉన్న తన నివాసం ‘అల్లు ఇల్లు’ కాకుండా, అత్యాధునిక హంగులతో, సరికొత్త డిజైన్తో ఈ ఇంటిని తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ (Allu Arjun Palace) చిరంజీవి ఇంటికి దగ్గరలోనే ఈ ఇల్లు ఉండబోతుండటంతో, మెగా , అల్లు అభిమానులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి గృహప్రవేశం చేసే అవకాశం ఉందని సమాచారం.

అత్యున్నత హంగులు , (Allu Arjun Palace) డిజైన్
అల్లు అర్జున్కు మొదటి నుంచి క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. అది ఆయన సినిమాల్లోనే కాకుండా ఆయన వాడే వస్తువులు, వాహనాలు (క్యారవాన్), ఇళ్లలో కూడా కనిపిస్తుంది. ఈ కొత్త ఇంట్లో అత్యాధునిక స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్, జిమ్ , అంతర్జాతీయ స్థాయి (Jubilee Hills) ఇంటీరియర్ డిజైన్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రకృతికి దగ్గరగా ఉండేలా పచ్చదనం కోసం ప్రత్యేక గార్డెన్ ఏరియాను కూడా ఈ నిర్మాణంలో భాగంగా ఉంచారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక ఆధునిక రాజభవనంలా ఉండబోతోంది.
సినిమాల పరంగా అల్లు అర్జున్ ప్రయాణం
ఇంటి నిర్మాణంతో పాటు అల్లు అర్జున్ కెరీర్ కూడా ఇప్పుడు (Tollywood) పీక్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం అందరి కళ్ళు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka) పైనే ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘పుష్ఫ-3’ ఈ సినిమాపైన కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టారు.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వంటి భారీ హిట్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక భారీ యాక్షన్ డ్రామాను బన్నీ ప్రకటించారు. ఇది భారతీయ సినిమాలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా నిలుస్తోంది.
వరుస పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్న అల్లు అర్జున్, వ్యక్తిగత జీవితంలో కూడా అంతే వైభవాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో ఆయన నిర్మిస్తున్న ఈ కొత్త ఇల్లు ఆయన కష్టానికి , విజయానికి నిదర్శనంగా నిలవనుంది. అటు పుష్పరాజ్ గా బాక్సాఫీస్ వద్ద పలకరించడానికి సిద్ధమవుతూనే, ఇటు తన సొంతింటి కలలను నిజం చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్. ఒకవైపు కెరీర్, మరోవైపు వ్యక్తిగత జీవితం.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బన్నీ ముందుకు దూసుకుపోతున్నారు.














