AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల (Promotions) ప్రక్రియకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశిస్తూ, రేపటి నుంచే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
రేపటి నుంచే పదోన్నతులు.. (AP News) సర్దుబాటు ప్రక్రియ!
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. రేపటి నుంచి పదోన్నతులతో పాటు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను కూడా అమలు చేయనున్నారు. (AP News) అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎక్కడా ప్రమోషన్లు ఆగిపోకుండా, రేపటి లోపే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని స్పష్టమైన ‘డెడ్లైన్’ విధించింది. ముఖ్యంగా కమర్షియల్ టాక్స్ శాఖతో పాటు అన్ని హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (HODs)లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ముందస్తు చర్యలు: కొత్త ఎంప్లాయ్మెంట్ (AP News) ఆర్డర్ నేపథ్యంలో..
లోకల్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కొత్త ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ చట్టం త్వరలో అమల్లోకి రానుంది. ఈ చట్టం అమలు కాకముందే ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి కొత్త చట్టం అమల్లోకి వస్తే సీనియారిటీ విషయంలో సాంకేతిక (AP News) సమస్యలు లేదా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే, భవిష్యత్తులో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈ ‘స్పెషల్ క్లియరెన్స్ డ్రైవ్’ను ప్రభుత్వం చేపట్టింది.
Read Also : CM Revanth Reddy : ఉద్యోగులకు ‘రేవంత్’ భరోసా.. వంద రోజుల్లో రూ. 6 వేల కోట్ల బకాయిల చెల్లింపు..!
ఈ-డీపీసీ (e-DPC) తో పారదర్శకత
ఉద్యోగుల పనితనాన్ని మెరుగుపరచడంలో పదోన్నతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో ఎవరికీ అన్యాయం జరగకూడదని ప్రభుత్వం ‘ఈ-డీపీసీ’ (e-DPC) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల గతంలో ఏప్రిల్, ఆగస్టు వరకు వేచి చూడాల్సిన పదోన్నతులు.. నవంబరు, డిసెంబరు నెలల్లోనే వచ్చే అవకాశం కలిగింది. ఈ విధానం వల్ల ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా పారదర్శకత కూడా పెరిగింది.
పెండింగ్ సమస్యలకు చెక్.!
అయితే, ఈ-డీపీసీ అమల్లో ఉన్నప్పటికీ.. సచివాలయంలోని ఆర్థిక శాఖ, అసెంబ్లీ వంటి విభాగాల్లో గత రెండేళ్లుగా పదోన్నతులు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ శాఖలో చూసినా ఏదో ఒక స్థాయిలో ప్రమోషన్లు ఆగిపోయి ఉన్నాయని వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
Read Also : Good News : తిరుమల భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ 3 ప్రత్యేక రైళ్లు..!
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. పదోన్నతుల ద్వారా బాధ్యతలు పెరగడమే కాకుండా, వారిలో కొత్త ఉత్సాహం నిండుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.














