Janasena Mla: తమ పార్టీ అధ్యక్షుడి బాటలో నడవాలని అనుకున్నారో, ఏమో కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం వెరీ స్పెషల్ అనవచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే వ్యవసాయం అంటే ఇష్టమన్న విషయం అందరికీ తెల్సిందే. అదే బాటలో నడుస్తున్న ఈ మహిళా ఎమ్మెల్యే తన వ్యవసాయ పద్దతులతో శభాష్ అనిపించుకుంటున్నారు.
రాజకీయాల్లో రైతు పేరు వినిపించకుండా రోజు గడవదు. ప్రతి నాయకుడు “రైతే రాజు” అంటారు. కానీ ఆ మాటలను నిజంగా ఆచరణలో పెట్టేవాళ్లు ఎంతమంది?.. ఇదే ప్రశ్నకు ఇప్పుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి (జనసేన) ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చారు. అవును మాటల్లో కాదు.. నేరుగా తోటలోకి దిగి, మట్టిని తాకి, సేంద్రియ సాగు చేస్తూ అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
మాటలు కాదు.. యాక్షన్!
చాలామంది రైతుల గురించి మాట్లాడుతారు. కానీ రైతు లాగా పని చేయడం మాత్రం చాలా అరుదు. మాధవి మాత్రం ఆ రూల్ను బ్రేక్ చేశారు. అధికార బిజీ మధ్యలోనే సమయం కేటాయించి, తన సొంత తోటలోకి వెళ్లి స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఇది కేవలం ఫోటో కోసం చేసిన పని కాదు.. నిజంగా ఆచరించిన పని.
మామిడికి కవచం.. ఇది స్ట్రాటజీ!
ఈ తోటలో ముఖ్యంగా మామిడి పంటపై ఆమె ఫోకస్ పెట్టారు. ప్రతి మామిడికాయకు సేఫ్టీ కవర్లు తొడిగారు. ఇది చిన్న పని కాదు.. కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. పక్షి కాటు, పురుగుల దాడి, కాయ కుళ్ళు ఇవన్నీ తగ్గిపోతాయి. దీంతో పంట నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర వస్తుంది.
రసాయనాలకు కట్!
ఇక్కడే ఆమె ఇచ్చిన మెయిన్ మెసేజ్ ఏమిటంటే.. “రసాయనాలకు గుడ్బై” చెప్పండి అంటూ తను ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేల తల్లిని విషపూరితం చేసే రసాయనాల నుంచి దూరంగా ఉండాలని, సేంద్రియ పద్ధతులే భవిష్యత్తు అని ఆమె స్పష్టం చేశారు. ఇది రైతులకు ఒక క్లియర్ వార్నింగ్ కూడా ఒక మంచి గైడెన్స్ గా కూడా చెప్పవచ్చు.
Also Read: https://www.telugunews.co/agriculture-msp-rabi-increase/
రైతులకు స్ట్రాంగ్ మెసేజ్
ఆమె రైతులకు ఇచ్చిన సందేశం సింపుల్ కానీ పవర్ఫుల్. సేంద్రియమే సురక్షితం, నాణ్యతే లాభం, సాంకేతికతే మార్గం.. ఈ మూడు పాటిస్తేనే వ్యవసాయం లాభదాయకం అవుతుందని చెప్పారు. నాయకుడు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు.. ముందు నిలబడి చేసి చూపించడం. మాధవి అదే చేశారు.. రైతుల కోసం తీసుకునే నిర్ణయాలు.. రైతు కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతాయని ఆమె నిరూపించారు.
వైరల్ అవుతున్న వీడియోలు
ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అసలు నాయకత్వం, రైతులకు నిజమైన ఆదర్శం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సేంద్రియ సాగు గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు అది ఒక ట్రెండ్ కాదు.. అవసరం. ఎమ్మెల్యే మాధవి చేసిన ఈ చర్య.. ఆ మార్పుకు ఒక స్టార్ట్ పాయింట్గా మారింది.
రైతు గురించి మాట్లాడటం అందరికీ తెలుసు.. కానీ రైతు లాగా జీవించడం కొద్దిమందికే సాధ్యం. ఆ కొద్దిమందిలో ఇప్పుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కూడా చేరారు. మరి ప్రశ్న ఇప్పుడు మీకే.. మాటల్లోనే ఆగిపోతారా?.. లేక ఆచరిస్తారా?






